వ్యవసాయ రంగానికి  చేయూత

విజయనగరం,జూలై4(జ‌నంసాక్షి): రైతులు సహకార సంఘాలను వినియోగించుకోవాలని, సంఘాలను బలోపేతం చేసేందుకు అవసరాలను తీర్చే వ్యాపారాలన్నింటిని చేస్తున్నామని జిల్లా సహకార శాఖాధికారి అన్నారు.  గ్రావిూణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు రుణాలను అందించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సహకారశాఖ ఆరు దశాబ్దాలుగా పనిచేస్తుందని అన్నారు. సహకార సంఘాలు మాత్రమే రైతుల అవసరాలకు రుణాలు అందిస్తున్నాయని అన్నారు. రైతులు సక్రమంగా వినియోగించుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సహకార వారోత్సవాల్లో రైతులు పాల్గొని అన్ని కార్యక్రమాలపై అవగాహన పొందాలని అన్నారు.