వ్యాపారి హత్య: దోపిడీ
హైదరాబాద్,ఆగస్ట్17(జనం సాక్షి ): నగరంలో రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలోని హైదర్ గుడా ఎర్రభోడా కాలనీలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. రాజేందప్రసాద్ అగర్వాల్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. 40 తులాల బంగారం నగదు అపహరించారు. ఈ క్రమంలో అడ్డుకున్న రాజేందప్రసాద్ అగర్వాల్ నోట్లో గుడ్డలు కుక్కి తలపై మోది హత్యచేసి పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.. డాగ్ స్క్వాడ్ తో హత్యకు గల ఆధారాలు తెలుసుకుంటున్నారు.