శంకర్‌మఠంలో ఇంటి దొంగలు

18లక్షల విలువైన నగలుచోరీ
హైదరాబాద్‌,మే18(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న నగరంలోని నల్లకుంట శంకరమఠంలో నగలు మాయమయ్యాయి. రూ.18 లక్షల విలువైన నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. భక్తుల కానుకలు భద్రపరిచిన గది నుంచి నగలు దొంగలించారు. నగలు మాయం ఘటనలో ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. తొలగించిన క్లర్క్‌స్థాయి ఉద్యోగులు శ్రీనివాస్‌, సాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మఠం నిర్వహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామి దృష్టికి వెళ్లడంతో.. వారి ఆదేశాల మేరకు పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది. సాయి అనే ఉద్యోగిని నల్లకుంట పోలీసులు  విచారించనున్నట్టు సమాచారం.