శంకుస్థాపన చేసిన హరీష్‌రావు

మెదక్ : మనూరు మండలం రానాపూర్‌లో మంత్రి హరీష్‌రావు డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఎమ్మెల్సీ రాములునాయక్, భూపాల్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.