శశికళ సీఎం అయితే రాష్ట్రంలో నేరాలు జరుగుతాయి:శశికళ పుష్ప

చెన్నై: శశికళ నటరాజన్ సీఎం అయితే రాష్ట్రంలో నేరాలు జరుగుతాయని, నేర చరిత్ర ఉన్న శశికళ తమిళనాడు సీఎంగా ఎలా చేస్తారంటూ అన్నాడీఎంకే బహిస్కృత ఎంపీ శశికళ పుష్ప ప్రశ్నించారు. ఈమేరకు శశికళ క్రిమినల్ నేపథ్యాన్ని ప్రస్తవిస్తూ ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ సహా నిందితురాలిగా ఉన్నారని, ఆమెపై ఇతర కేసులు బాగానే ఉన్నాయని, ఆమె ముఖ్యమంత్రి అయితే రాజకీయ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. జయ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె పన్నీర్ సెల్వానికి బాధ్యతలు అప్పగించారని శశికళ పుష్ప గుర్తు చేశారు.