శాకాంబరి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు.

పినపాక నియోజకవర్గం ఆగష్టు 12 (జనం సాక్షి); మణుగూరు.గుట్టమల్లారం. శ్రీ శ్రీ శ్రీ పంచముఖ వేద గాయత్రి మాత ఆలయం లో ఆలయ వ్యవస్థాపకులు దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు,
ఆలయ అర్చకులు అక్కినేపల్లి ప్రదీప్ శాస్త్రి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారు శాఖంబరి అవతారం లో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిత్యం పూజించే భక్తులకు శ్రావణ పౌర్ణమి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని కనులారా వీక్షించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తీర్ధప్రసాధములు స్వీకరించారు.