శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు 

జనగామ,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  బచ్చన్నపేట,మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కొడవటూరు సిద్ధులగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే శివకల్యాణం, బ్ర¬్మత్సవాలను ఘనంగా నిర్వహించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. మార్చి 2 నుంచి 5 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వేలాదిగా భక్తులు పాల్గొంటారు.  ఈ మేరకు అధికారులు పక్కాగ ఆచర్యలు తీసుకోవాలన్నారు.  సిద్ధేశ్వరస్వామి బ్ర¬్మత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. శివకల్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారని అభినందంచారు. రెట్టింపు ఉత్సాహంతో ఈసారి వైభవంగా జరిపించాలన్నారు. ప్రభుత్వం, దేవాదయ శాఖ తరఫున సహాయ సహకారాలు ఉంటాయన్నారు. సిద్ధేశ్వరుడి ఆశీర్వాదాలను భక్తులు ఏటా పొందుతున్నట్లు చెప్పారు. ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ తరఫున ఇప్పటికే రూ. 50 లక్షలు మంజూరయ్యాయని ముత్తిరెడ్డి అన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసి జిల్లాలోనే సిద్ధులగుట్టను మినీ యదాద్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ఎంపీడీవో అనిత పాల్గొన్నారు.