శీరామాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం

గరిడేపల్లి, జూన్ 20 (జనం సాక్షి): మండలంలోని ముత్యాల నగర్ గ్రామం నందు గ్రామస్తులచే దాదాపు 15 లక్షల వ్యయంతో శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం చేయుటకు గాను సోమవారం భూమి పూజ శంకుస్థాపన నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉదయం సుప్రభాత సేవ  7 గంటలకు గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనం వాస్తు, నవగ్రహ పూజా కార్యక్రమలు సుముహూర్తం నకు యంత్ర స్తాపనం శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించడమైనదనారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగి నాగేశ్వరరావు,  ఎంపిటిసి పోరళ్ళ మహాలక్ష్మి గోవింద్, గ్రామ పెద్దలు పేరాల వెంకన్న,  కన్నేకంటి అంజయ్య, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. పూజాకార్యక్రమాలు గ్రామ పురోహితులు ద్రోణా సుబ్రహ్మణ్య శర్మ, రాయప్రోలు శ్రీరామయ్య శర్మ ,రాధాకృష్ణ మూర్తి నిర్వహించారు.