శ్రీజయ ల్యాబ్ ఎదుట కార్మికుల ఆందోళన…

నల్గొండ: చౌటుప్పల్ మండలం మల్కాపురంలో శ్రీజయ ల్యాబ్ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. మంగళవారం విషవాయువు లీకేజీ ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.