శ్రీవారి సేవలో సిబిఐ డైరెక్టర్‌

తిరుమల,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): తిరుమల శ్రీవారిని సిబిఐ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ వర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అలోక్‌కుమార్‌ దంపతులకు వేద పండితులు ఆశీర్వచంన, శ్రీవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అలోక్‌కుమార్‌ తెలిపారు. అలాగే ఎపికి చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.