శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 2 : మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రములో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించబడునున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతము నిర్వహించే భక్తులు రూ. 1116/- చెల్లించి పాలకమండలి వారిచే వెండి కాయన్ పూజా సామాగ్రి పొందవచ్చునని ఆయన తెలిపారు.