సంక్షేమ రంగానికి పెద్దపీట: మంత్రి

వికారాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి ): సంక్షేమంలో తెలంగాణ ముందున్నదని, అన్ని వర్గాలను అక్కున చేర్చుకుని ఆదుకోవడమే లక్ష్యంగా సిఎంకెసిఆర్‌ పనిచేస్తున్నారని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు.జిల్లాలోని యాలాల మండల పరిషత్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. మంత్రి మహేందర్‌రెడ్డి నేరుగా లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కోట్లాది నిధులు అందిస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్లు, గర్భిణులకు పౌష్టికాహారం వంటి పథకాలు మహిళా సాధికారతకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.