సంఘ్‌పరివార్‌ కుట్రల్ని తిప్పికొడతాం

 

– లాలూప్రసాద్‌యాదవ్‌
పాట్నా,మే 19(జనంసాక్షి): బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పై రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలను తిప్పికొడతామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడితే కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును ఐదేళ్ల పాటు కొనసాగనీయకుండా గద్దె దించుతామని హెచ్చరించారు. బీజేపీ ఆదేశాలతోనే తనపై అవినీతి అబియోగాలు నమోదు చేశారని మండిపడ్డారు. తనపై బురద చల్లితే మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. బీజేపీపై పోరాడేందుకు, భవిష్యత్‌ కార్యాచరణ కోసం ఆగస్టు 27న పట్నాలోని గాంధీ మైదాన్‌లో ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. భావసారూప్యం కలిగిన పార్టీల నాయకులను ఈ ర్యాలీకి ఆహ్వనిస్తున్నట్టు తెలిపారు. తన కుమారులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధంగానే ఆస్తులు సంపాదించారని లాలూ స్పష్టం చేశారు.

7.