సత్తుపల్లిలో సైన్యం కవాతు

ఖమ్మం,నవంబర్‌1(జ‌నంసాక్షి): సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలలోని సమస్యాత్మక ప్రాంతాలలో సైనిక బలగాలు కవాతు నిర్వహించాయి. సమస్యాత్మక గ్రామాలలో బైండోవర్‌ కేసులు కూడా భారీగా నమోదు కావటంతో ఎన్నికల సమయంలో చిన్న గొడవకు కూడా అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే కవాతు నిర్వహించినట్టు సత్తుపల్లి డీఎస్పీ ఆంజనేయులు తెలిపారు. సత్తుపల్లి పట్టణ, రూరల్‌ సీఐలు, ఎస్‌.ఐ లు కవాతులో పాల్గొన్నారు.