సమస్యలపై సిఎంకు నివేదిస్తా: లక్ష్మీనారాయణ

కర్నూలు,జూలై19(జ‌నం సాక్షి): సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నానని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. వివిధ ప్రాంతాల్లో తాను పరిశీలించిన సమస్యలపై సీఎంకు నివేదిక ఇస్తానన్నారు. రాజకీయాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే అప్పుడు రాజకీయాల గురించి ఆలోచిస్తానన్నారు. గ్రావిూణాభివృద్ధి, వ్యవసాయ రంగాలపై ఇష్టంతోనే ఉద్యోగం వదిలేశానని పేర్కొన్నారు. రైతుల పిల్లలు వ్యవసాయంలోకి రావాలంటే వ్యవసాయ విద్యలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయించాలన్నారు.