సమిష్టి కృషితోనే గ్రామాల అభివృద్ది

నల్లగొండ,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     ప్రతీ గ్రామం ఆదర్శంకావాలని ఇందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి 30రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు.రాష్టాన్న్రి సర్వతోముఖాభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌ గ్రామాలను కూడా పచ్చదనం, పరిశుభ్రంగా చేయాలని కంకణం కట్టుకున్నారని ఇందులో భాగంగానే చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.మండలంలోని ప్రజాప్రతినిధులు ఒక్కోగ్రామాన్ని దత్తత తీసుకొన్నప్పుడు తప్పనిసరిగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అందరి సహకారంతో ముందుకెళ్లాలన్నారు.