సమ్మె యథాతథం

– స్పష్టం చేసిన ఆర్టీసీ కార్మికల సంఘాల ఐకాస అశ్వత్థామ రెడ్డి
– త్రిసభ్య కమిటీతో చర్చలు విఫలం – 5 నుంచి ఎక్కడికక్కడే నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్‌,అక్టోబర్‌ 3 (జనంసాక్షి): త్రిసభ్య కమిటీతో గురువారం జరిపిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 5 నుంచి సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్‌ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేందుకు సమ్మె చేసి తీరతామని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వమే కార్మికులను సమ్మెలోకి నెట్టిందని.. వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు లేవని ఆరోపించారు. ఎస్మా వంటి చట్టాలు ప్రయోగించినా భయపడబోమని అన్నారు. సీఎం భేషజాలకు పోకుండా డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు బస్సు డ్రైవర్లను రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు మళ్లీ చర్చలు త్రిసభ్య కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ”సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ అధికారులతో చర్చించాం. వారు రెండు కారణాల దృష్ట్యా సమ్మెను వాయిదా చేసుకోవాలి . దసరా పండుగ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బయులు తలెత్తుతాయి కాబట్టి వాయిదా | వేసుకోవాలి. సమ్మెకు వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాలపై ఆర్టీసీ అధికారులు దృష్టి పెడతారు. కాబట్టి కమిటీ నివేదిక ఇవ్వడం ఆలస్యం అవుతుంది. కమిటీకి వారం రోజుల సమయం కావాలి. పూర్తిగా అధ్యయనం చేసి – ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం.” అని అన్నారు. అందరికి న్యాయం జరిగేలా రిపోర్ట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ? ఉన్నామని, ఇప్పటికిప్పుడు అంటే.. నివేదిక సరిగ్గా ఇవ్వలేమని కమిటీలో మరో సభ్యుడు రామ కృష్ణారావు
అన్నారు. రేపు ఆర్టీసీ ఐకాసతో మళ్లీ సమావేశం అవుతామని తెలిపారు. కార్మికులు తమ మాట వినకుండా సమ్మెకు వెళ్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని సునీల్‌ శర్మ చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని భరోసానిచ్చారు. అవసరమయితే.. ఎస్మా చట్టం కూడా ప్రయోగిస్తామని స్పష్టం చేశారు.