సర్కార్ భూములను విక్రయించిన టీ.ప్రభుత్వం

హైదరాబాద్ : తెలంగాణరాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రభుత్వ భూములను విక్రయించాలని సర్కార్ భావించింది. అనుకున్నదే తడవుగా ఈ మేరకు టీఎస్ ఐసీసీ ద్వారా విక్రయానికి పూనుకుంది.ఈ మేరకు ఖానామెట్ లోని ప్రభుత్వ స్థలాలను ఎకరానికి 29 లక్షలకు కున్ మోటార్ సంస్థకు అమ్మేసింది.

రెండు ఎకరాలను ఈ కున్ సంస్థ కొనుగోలు

ఈ కున్ సంస్థ రెండు ఎకరాలను వేలంలో కొనుగోలు చేసింది. ఇదే ప్రాంతంలోని వేరే స్థలానికి ఎకరాకు 18 కోట్లు ధర పలికింది. దీంతో పాటు షేక్ పేట్ లోని ఆల్ హామ్రా కాలనీలో గజం 76 వేల 200 రూపాయలకు విక్రయించారు. ఈ కాలనీలో 920 గజాలను 7 కోట్లకు ఆల్ హామ్రా సంస్థ కొనుగోలు చేసింది. టీఎస్ఐసీసీ ద్వారా ప్రభుత్వ భూములు విక్రయించడం ఇది రెండో సారి. గతంలో నిర్వహించిన వేలంలో కూడా ఎకరానికి 29 కోట్లు ధర పలికింది. దశల వారీగా మరికొన్ని ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయించింది సర్కార్ . ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.