సర్పంచ్‌గా ఎమ్మెల్యే కూతురు

ఏకగ్రీవంగా ఎన్నికైన సంగీత

మహబూబ్‌నగర్‌,జనవరి14(జ‌నంసాక్షి): కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ కూతురు సీఎల్‌ సంగీతశ్రీనివాస్‌ యాదవ్‌ వెల్జాల్‌ సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. తలకొండపల్లి మండలం వెల్జాల్‌ సర్పంచ్‌ స్థానాన్ని రిజర్వేషన్లలో భాగంగా జనరల్‌ కుకేటాయించారు. కాగా మూడు రోజులుగా స్వీకరిస్తున్న నామినేషన్లలో భాగంగా ఆ గ్రామానికి సంగీత ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. దీంతో ఆమె ఎన్నిక ప్రకటన లాంఛనమే. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 2013 లో కూడ ఆమె వెల్జాల్‌ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. స్వగ్రామమైన చల్లంపల్లికి జైపాల్‌యాదవ్‌ రెండు సార్లు సర్పంచ్‌గా పనిచేయగా అదే మండలం వెల్జాల్‌కు ఆయనకూతురు సంగీత రెండు సార్లు సర్పంచ్‌ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.