సస్యరక్షణ చర్యలతో మేలు

జగిత్యాల,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): సస్యరక్షణ చర్యలతోనే అధిక దిగుబడులు సాధించ వచ్చని శాస్త్రవేత్తలు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వాలని జగిత్యాల పరిశోధన స్థానం సంచాలకుడు ఉమారెడ్డి అన్నారు. జిల్లాలో వివిధ రకాల పంటలు సాగు అవుతున్నాయని తెలిపారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంటలను సందర్శించాలన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పరిశోధన స్థానంలో వివిధ రకాల విత్తనోత్పత్తిపై పరిశోధన జరుగుతుందని తెలిపారు.