సాకటి దశరథ్ కు గణ  సన్మానం చేసిన ఆలయ సిబ్బంది… గ్రామస్థులు.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్. అనంతరం ఆలయ సిబ్బంది తో కలిసి    భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. మందిరంలో నిత్యం ఆలయ పూజలు నిర్వహించడానికి మైక్ సెట్ లేకపోవడంతో వెంటనే స్పందించి ఆలయ కమిటీ సిబ్బందికి తన వంతు సాయంగా  మైక్ సెట్ ను అందించారు. అనంతరం ఆయనను  ఆలయ సిబ్బంది మరియు గ్రామస్తులు  శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో  మండల అధ్యక్షులు స్వామి , నల్ల రత్నాకర్ రెడ్డి ,కారం రవి. ,కాంతారావు,పూర్ణ చందర్,తదితరులు పాల్గొన్నారు.