సాగర్‌కు కొనసాగుతున్న వరద

నల్లగొండ,సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) : శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ప్లో వస్తుండడంతో అధికారులు జలవిద్యుత్‌ కేంద్రాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 33549 క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లోగా వస్తోంది. నాగార్జునసాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.20 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో 298.0120 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి ఎడమకాల్వ ద్వారా 4881 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 7878 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, డీటీ గేట్స్‌ (డైవర్షన్‌ టన్నల్‌ ) ద్వారా 10 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం ద్వారా నీటి విడుదల లేదు. రిజర్వాయర్‌ నుంచి మొత్తం 15219 క్యూసెక్కుల నీరు ఔట్‌ఎ/-లోగా విడుదలవుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 877.70 అడుగుల వద్ద 176.7402 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 90890 క్యూసెక్కుల ఇన్‌ప్లో కొనసాగుతోంది.