సామియా అర్జూతో పాక్‌ క్రికెటర్‌ పెళ్లి

హైదరాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) :  పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ.. భారత్‌కు చెందిన ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ సామియా ఆర్జూను పెళ్లి చేసుకున్నాడు. దుబాయ్‌లోని అట్లాంటిస్‌ ¬టల్‌లో నిఖా వేడుకను ఘనంగా నిర్వహించారు. కేవలం కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ఇండియాలో పుట్టి పెరిగిన సామియా ఆర్జూ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. పైలట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆమె కొన్నాళ్ల క్రితం అలీకి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది. పెళ్లి దుస్తుల్లో ఇద్దరూ మెరిసిపోయారు. బ్లాక్‌ షేర్వానీలో హసన్‌, రెడ్‌ అండ్‌ గోల్డ్‌ డ్రెస్సులో ఆర్జూ ఆకట్టుకున్నారు. ఇద్దరూ ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్‌ను బుర్జ్‌ ఖలీఫా ముందు జరిపారు. వలీమా కూడా దుబాయ్‌లోనే నిర్వహించనున్నారు.