సింగరేణిపై గులాబీ జెండా ఖాయం
– వారసత్వ ఉద్యోగాలకు కట్బుబడ్డాం
– ఎంపీ కవిత
హైదరాబాద్,సెప్టెంబర్ 24,(జనంసాక్షి): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తారని ఎంపీ కవిత అన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో తాను ఇచ్చిన హావిూని అమలు చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. తెరాసకు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు వారసత్వ ఉద్యోగాలపై కేసులు వేయించారన్నారు. ప్రభుత్వానికి కార్మికులకు వారిధిగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని కార్మికులు గెలిపించాలని ఆమె కోరారు.సింగరేణిలో పనిచేసే కార్మికులను భారత సైనికుడిగా కేసీఆర్ భావిస్తారని కవిత చెప్పారు. తెరాస కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెరాస నేత వేణుగోపాలాచారి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ల సమక్షంలో టీఎన్టీయూసీ, సింగరేణి హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల నుంచి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో చేరారు.