సిద్దిపేటలో ఐదుగురు స్వతంత్రులు టిఆర్ఎస్ లోకి!

r0b235xzమెదక్ జిల్లా సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఐదుగురు అభ్యర్థులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మూడో వార్డు నుంచి సంధ్య, 22వ వార్డు ప్రవీణ్, 25వ వార్డు ప్రమీల, 27వ వార్డు విజయారాణి, 34వ వార్డు మంజుల టీఆర్ఎస్ లో చేరారు. ఐదుగురికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ నెల 6న జరిగిన సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ఉదయం నిర్వహించారు. టిఆర్ఎస్ ఆరుచోట్ల ఏకగ్రీవంగా ఇప్పటికే ఎన్నిక కాగా.. మరో 16 స్థానాలను గెలుచుకుంది. దీంతో, మొత్తం 34 స్థానాల్లో 22 టిఆర్ఎస్ ఖాతాలో చేరాయి. గెలిచిన ఏడుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఐదుగురు ఇవాళ సాయంత్రం టిఆర్ఎస్ లో చేరారు. వీరి చేరికతో టిఆర్ఎస్ సంఖ్య 27కు చేరింది. కాంగ్రెస్, బీజేపీ చెరో రెండు స్థానాల్లో విజయం సాధించగా, ఎంఐఎం ఒకచోట గెలిచింది.