సిబిఐ కోర్టుకు హాజరైన జగన్
హైదరాబాద్,ఆగస్ట్17(జనం సాక్షి ): అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో శుక్రవారం వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్రెడ్డి హైదరాబాద్లోని నాంపల్లిలోగల సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నంలో జగన్ పాదయాత్ర నిర్వహిస్తుండగా..స్వల్ప విరామం ఇచ్చి కోర్టుకు హాజరయ్యారు. జగన్ అక్రమాస్తులకు సంబంధించి తదుపరి విచారణ ఈ నెల 31 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది