సిలిండర్‌ పేలి పూరిల్లు దగ్ధం

నలుగురికి తీవ్ర గాయాలు
మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): శివంపేట మండలం శంకర్‌తండాలో మంగళవారం  ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్తప్రికి తరలించారు. వీరుంటున్న  పూరిల్లులో గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. దీంతో పూరిల్లు పూర్తిగా కాలిపోగా, నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.