సిసి రోడ్ల నిర్మాణానికి 9.48 కోట్ల నిధులు మంజూరు

 

 

 

 

 

 

 

మంజూరు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు – మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు జనం సాక్షి, మంథని : పంచాయతీ రాజ్ శాఖ నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంథని నియోజకవర్గము పెద్దపల్లి జిల్లా సంబంధించిన నూతన సీసీ రోడ్లకు సిసి డ్రైనేజీ ప్రతిపాదనలు పంపగా మంజూరు చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. మంథని, రామగిరి, ముత్తారం, కమాన్ పూర్, పాలకుర్తి గాను 9 కోట్ల 48 లక్షలు మంజూరు అయినట్లు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఈ సందర్భంగా తెలిపారు.