*సి ఐ టి యు ఆవిర్భాదినోత్సవ జెండా ఆవిష్కరణ*

మునగాల , మే 31(జనం సాక్షి): మునగాల మండల కేంద్రం లో సి ఐ టి యు 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్బంగా అనుబంధ సంఘాలైన భవన నిర్మాణ రంగం , గ్రామపంచాయతీ కార్మికులు ,హమాలీ కార్మికులు , రవాణా , మధ్యాహ్నభోజనం కార్మికులు మరియు వివిధ రంగాల కార్మికులు శనివారం జెండా ఆవిష్కరణలు చేయటం జరిగింది . ఈ సందర్బంగా  సి ఐ టి యు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ , వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్య పై  పని చేస్తున్న సంఘము సి ఐ టి యు అని అన్నారు . ఈ కార్యక్రమం లో  వివిధ రంగాల కార్మిక నాయకులు బండారు గురవమ్మ ,బొల్లికొండ నాగయ్య ,వేట మల్లయ్య , పొన్నఅంజయ్య ,బి రవి , యోహాను ,యమ్ రాంబాబు , జి సోమయ్య ,యన్ బిక్షo తదితరులు పాల్గొన్నారు .