సీఎం కేసీఆర్ ఆదేశాలు..కాకినాడకు మంత్రి పువ్వాడ

తూర్పుగోదావరి: పాపికొండ టూర్ లో బోటు ముంపు ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఈ ప్రమాదంలో ఉన్నందున..ఘటన ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి పువ్వాడ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ హుటాహుటిన కాకినాడకు బయలుదేరి వెళ్లారు.