సీనియర్‌ ఓటర్లకు సన్మానం

విజయనగరం,జనవరి25(జ‌నంసాక్షి): కుల,మత,ప్రాంతీయ బేదాలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఓటు నమోదుచేయించుకోవడంతో పాటు దానిని వినియోగించుకోవలన్నారు. పఅ/-పుడే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడుతాయని అన్నారు. కొవ్వూరు ఏబీఎన్‌ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగింది.ఈ సందర్భంగా సీనియర్‌ ఓటర్లను సన్మానించారు. నూతన ఓటర్లకు ఓటు గుర్తింపు పంపిణీ చేశారు. ఓటు హక్కు ద్వారా నిజమైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు.