సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలు అదుపులో ఉంటారు

★ఎల్లారెడ్డి ఎస్సై ఉపేందర్ రెడ్డి
ఎల్లారెడ్డి-అక్టోబర్-15(జనంసాక్షి)
ఎల్లారెడ్డి:ఆర్టీసీ బస్టాండ్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపారు.ఎల్లారెడ్డి ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ఆదివారం వారాంతపు సంత,ఉంటుందని నిత్యం వందలాది మంది ప్రయాణీకులు వస్తుంటారు,వెళ్తుంటారు ఆ సమయంలో దొంగలు తమ చేతి వాటాన్నీ ప్రదర్శించే అవకాశంమున్నందున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వారికి అరికట్టవచ్చని ఆయన ఆర్టీసీ అధికారులతో సూచించారు.వారాంతపు సంతతో పాటు దసరా పండగ సందర్భంగా బస్టాండ్ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ సిబ్బందితో పహారా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.