సెంట్రల్ వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్,మే16(జనం సాక్షి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్లాంట్ సైన్స్లో పీహెచ్డీ చదువుతున్న నీతూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకున్నట్లు వర్శిటీ అధికారులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన నితూను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే నీతూ పలుమార్లు ఆత్మహత్యకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నీతూ మానసిక స్థితి సరిగా లేదని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.