సైకో దాడిలో నలుగురికి గాయాలు

saikoఖమ్మం, ఆగస్టు 26 : జిల్లాలోని సులానగర్ గ్రామంలో ఓ సైకో వీరంగం సృష్టించింది. రోడ్డుపై వెళ్లే వారిపై దాడి దిగింది. ఓ ఆటోను ఆపి ప్రయాణికులపై రాళ్లు విసిరింది. దొరికిన వారిని దొరికినట్టుగా కర్రతో కొట్టింది. సైకో దాడిలో తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. గతంలో అంబులెన్స్‌ను అడ్డుకుని అద్దాలు పగులగొట్టిందని స్థానికులు చెబుతున్నారు.