సోనియా సభల పోస్టర్లలో కానరాని విజయశాంతి
సోనియా సభల పోస్టర్లలో కానరాని విజయశాంతి
మహిళల ఫోటో లేకుండా చేస్తారా అని మండిపడ్డ రాములమ్మ
హైదరాబాద్,నవంబర్20(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్ పెద్దలపై ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. సోనియా సభలకు సంబంధించిన పోస్టర్లలో తన ఫోటో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. స్టార్ కాంపెయినర్గా ఉన్న తనఫోటే లేకుంటే ఎలా అని అన్నారు. ఈ నెల 23న ఎన్నికల ప్రచారానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇరువురు నేతలకు స్వాగతం పలుకుతూ టీపీసీసీ ఒక పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టరే విజయశాంతి ఆగ్రహానికి కారణమైంది. పోస్టర్ లో టీపీసీసీ సీనియర్ నేతల ఫొటోలను మాత్రమే ఉంచారని, ఒక్క మహిళా నాయకురాలి ఫొటోను కూడా ఉంచలేదని ఆమె మండిపడ్డారు. ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని టీఆర్ఎస్ పై మనం విమర్శలు గుప్పిస్తున్నామని… మన పోస్టర్లో ఒక్క మహిళ ఫొటో కూడా లేకపోవడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారని విమర్శించారు. ఈ సభలో కేవలం మగవాళ్లు మాత్రమే కాకుండా, మహిళలు కూడా పాల్గొంటారు కదా అని ప్రశ్నించారు.