స్కూలు పిల్లల్లో నులిపురుగుల నివారణ

రంగారెడ్డి,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈనెల 19న ప్రపంచ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా స్కూలు పిల్లలో దీనిని నిర్మూలించే కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 ఏండ్ల వయస్సులోపు పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలనుపంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 8.23 లక్షల మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు జూనియర్‌ కళాశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో మాత్రల పంపిణీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.