స్కూలు బస్సుల ఫిట్‌నెస్‌ పరిశీలన

నెల్లూరు,మే22(జ‌నం సాక్షి ): గూడూరు ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం ఆర్టీఎ అధికరాఉలు శివరాంప్రసాద్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్కూల్‌,  కళాశాలల బస్సుల ఫిట్నేస్‌ లను పరిశీలించారు.అనంతరం వారు తమ కార్యా లయం నుండి భూదనం టోల్‌ ప్లాజా వరకు స్కూల్‌ బస్సును నడిపి వాహనం సామర్ద్యాన్ని పరిశీలించారు..ఈ సందర్భంగా శివరాంప్రసాద్‌ మాట్లాడుతూ…ఫిట్నేస్‌ ద్రువీకరణ పత్రంలేకుండా ఏవాహనమైనా రోడ్డుపై తిరిగితే కటిన చర్యలు తప్పవని, భావి భారత పౌరులైన విద్యార్దులకు వాహన ప్రయానాల్లో చిన్న పోరపాటు జరిగినా సహించేది లేదని,పాఠశాలలు ప్రారంబం అయ్యే లోపల బస్సులకు ఫిజికల్‌ ఫిట్నేస్‌ సర్టిఫికేట్లు కలిగి వుండాలని అన్నారు.  అలాగే వాహనాల్లో ఫస్ట్‌ ఏయిడ్‌ కిట్లతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తేలిపారు.
——-