స్త్రీశక్తిభవన్‌లో మహిళ దారుణ హత్య….

నిజామాబాద్:కామారెడ్డి పట్టణంలో ఆర్డీఓ, ఎంఈఓ ఆఫీసు మధ్యలో ఉన్న స్త్రీశక్తిభవన్‌లో గుర్తుతెలియని మహిళను దారుణంగా హత్య చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. కామారెడ్డి డీఎస్పీ భాస్కర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.