స్త్రీ నిధి బ్యాంకులకు చేయూత

3
మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ఆడిటోరియంలో స్త్రీనిధి సమావేశానికి   పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సూక్ష్మ రుణాలు ఉపయోగించుకుని జీవనోపాధి మెరుగుపర్చుకోవాలని, సంఘటితంగా ఉండి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. స్త్రీనిధి పథకాన్ని తెలంగాణ పల్లె ప్రగతి పథకంతో అనుసంధానం చేస్తామని తెలిపారు. సేవింగ్స్‌ను పెంచుకునే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని వెల్లడించారు. మహిళా శక్తికి ప్రభుత్వం చేయుతనిస్తుంది. స్త్రీనిధి బ్యాంకులో రూ.165 కోట్లు ప్రభుత్వం తరపున జమయ్యాయని చెప్పారు. దేశంలో ఐదంచెల ప్రభుత్వాలున్నాయి. కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ మనసున్న నాయకుడు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలతో పేదల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని తెలిపారు.