స్వచ్ఛ భారత్‌ సర్వేక్షణలో తెలంగాణ టాప్‌..

` రాష్ట్రప్రభుత్వ పనితీరు ఆదర్శవంతమైన పారదర్శక పాలకు నిదర్శనం:ముఖ్యమంత్రి కేసీఆర్‌
` సమిష్టికృషితో, పల్లెప్రగతిని సాధిస్తూ, పచ్చని తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతామన్న సీఎం
` గ్రావిూణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద పలు విభాగాల్లో రాష్ట్రానికి 13 అవార్డులు దక్కడంపై హర్షం
హైదరాబాద్‌(జనంసాక్షి):సుస్థిరాభివృద్దిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, ‘‘స్వచ్ఛ భారత్‌ సర్వేక్షణ ‘‘ లో మరోసారి దేశంలోనే నంబర్‌ వన్‌ గా నిలవడం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన, పారదర్శక పాలనకు మరోసారి అద్దం పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌ రావు అన్నారు. సమిష్టి కృషితో, పల్లె ప్రగతి’ ని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం కేసిఆర్‌ పునరుద్ఘాటించారు.గ్రావిూణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద పలు విభాగాల్లో తెలంగాణ రాష్ట్రం 13 అవార్డులు దక్కించుకుని, దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు దోహదం చేసిన  ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రావిూణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిని, శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని,  సర్పంచులను, ఎంపిటిసి లను, గ్రామ కార్యదర్శులను, సీఎం కేసిఆర్‌ ఈ సందర్భంగా అభినందించారు.