స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో ప్రతి ఒక్కరు పాల్గొనలి సర్పంచ్ కమలమ్మ

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 13 (జనంసాక్షి) ఆత్మకూరు మండలంలోని రాఘవాపురం గ్రామపంచాయతీ లో 75 వజ్రోత్సవాలు సందర్భంగా సర్పంచ్ దొండ కమలమ్మ రాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగే సంబరాలను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని అన్నారు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను విధిగా ఎగురవేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటం నరేష్ దొండ పురుషోత్తం రెడ్డి కూరేళ్ళ మహేష్ ఎండి నాయిమ్ వెంకన్న మహేష్ అరుణ్ తిరుమలేష్ మహేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు