హన్మకొండలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సమసమాజ స్థాపన కోసం సమస్యలు లేని తెలంగాణ లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదర్శవంతమైన పాలన సాగిస్తుందన్నారు. హన్మకొండలో జరిగిన బాబా సాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియంతో పాటు మంత్రి చందులాల్ పాల్గొన్నారు.