హుజూరాబాద్‌ బార్‌ అధ్యక్షుడి రాజీనామా

నేడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌

కరీంనగర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు హుజూరాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు బండి కళాధర్‌ తెలిపారు. అలాగే గురువారం ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేయబోతున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో 15 ఏళ్లుగా పనిచేసిన తనను టీఆర్‌ఎస్‌ గుర్తించలేదన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓట్లు అడిగితే నైతిక హక్కులేదన్నారు. మహిళలకు క్యాబినెట్‌లో స్థానం ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి ఈటల రాజేందర్‌ అనుచరులకు ఉచితంగా బెయిల్‌ ఇప్పించానని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో కొత్తగా చేరినవారికి మంత్రి ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. ఈ నెల 15న హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేస్తానని తెలిపారు. తమను కనీసంగా గుర్తించని టిఆర్‌ఎస్‌లో ఉండడం కంటే స్వంతంత్రంగా పోరాడడం మేలన్నారు. అందుకే నామినేషన్‌ వేయాలని నిర్ణయించామని అన్నారు.