హైవేపై అతివేగంగా ఆటోను ఢీకొన్న కారు

ఒకరు మృతి .. పలువరికి గాయాలు

గద్వాల,జూన్‌26(జ‌నం సాక్షి): వరుస రోడ్డు ప్రమాదాలు ఆడగం లేదు. మంగళవారం గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతివేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఏడుగురు ప్రయాణికులతో ఆటో ఉండవెల్లి నుంచి కర్నూలు వెళ్తుండగా హైవేపై టోల్‌ ప్లాజా వద్ద లారీని ఓవర్‌ టెక్‌ చేయబోయి అతివేగంతో వెనకనుంచి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘనటలో సూర్యబాబు(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.