హోంమంత్రి అబద్దపు ప్రచారాలు ఆపండి

– ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసేందుకు బయలుదేరుతుండటంతో వెనుదిరిగారు

హైదరాబాద్, ఏప్రిల్ 1(జనంసాక్షి): బుధవారం సాయంత్రం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసేందుకు ప్రగతిభవన్ గేటు వరకు వెళ్లారు. అదేసమయంల, ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌ను కలవడానికి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నారని తెలిసికొని, అదే సమయంలో లక్షీకాపూల్ లోని తన ఆఫీస్లో అత్యవసర పనుల విషయాలలో విజ్ఞప్తులు ఇవ్వడానికి కొంతమంది సందర్శకులు వేచి ఉన్నారని తెలిసి, హోంమంత్రి లక్షీకాపూల్ ఆఫీసు వెన్నక్కి వెళ్లారని హెమంత్రి పీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు. హోంమంత్రి , ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే విషయంలో ఎప్పుడూ ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. హోంమంత్రిని ప్రగతిభవన్ లోకి వెళ్ళకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే పరిస్థితి ఏనాడు ఉండదని, కాబట్టి ఈ విషయంలో అబద్దపు ప్రచారాలు చేయడం తగదని ఆయన స్పష్టం చేశారు.