11న పూలే జయంతి

నల్గొండ,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యక్రమాలు సక్రమంగా  నిర్వహించాలని కలెక్టర్‌ పి.సత్యనారాయణరెడ్డి తెలిపారు. పూలే జయంతి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లుచేయాలన్నారు. వివిధ శాఖలఅధికారులు, బీసీ సంఘం నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన సవిూక్షించారు. ఈనెల 11న ఉదయం 9 గంటలకు సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానించాలి, ఎవరెవరిని వేదికపై పిలవాలనేది సక్రమంగా తయారుచేయాలని సూచించారు.