12 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

రామకృష్ణాపూర్: అదిలాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్నరేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా రవీంద్రఖని రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి జరిగింది. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 12 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదుఏ చేశారు.