14నుంచి సుబ్రమణెళ్యిశ్వర బ్ర¬్మత్సవాలు

విజయనగరం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఈ నెల 14 నుండి 16 వ తేదీ వరకు పూల్‌ బాగ్‌ శ్రీ లక్ష్మిగణపతి కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వార్షిక బ్ర¬్మత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి ప్రకటించారు. సోమవారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిద్ధాంతి మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలు ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. బ్ర¬్మత్సవాల్లో పాల్గొనే భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 వ తేదీన నవ గ్రహ శాంతి ¬మం, 15 వ తేదీన స్వామి వారికి లక్ష పుష్ప అర్చన, 16 వ తేదీన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి సాయంత్రం 4 గంటలకు కళ్యాణం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బేతా కృష్ణారావు, కార్యదర్శి శ్రీనివాస గోపాల కఅష్ణ, కోశాధికారి వారణాశి సతీష్‌, ఉపాధ్యక్షులు దన్నాన రామమూర్తి, పైడి రాజు, కన్నబాబు, ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, అగస్త్య శర్మ, ఆర్వీ పంతులు పాల్గొన్నారు.