14 రోజుల తరువాత తల్లిఒడికి చేరిన చిన్నారి..

2u4nj7arనిజామాబాద్ : ప్రభుత్వం ఆసుపత్రిలో కిడ్నాప్ అయిన శిశువు మిస్టరీ వీడింది. నందిపేట మండలం కౌలుపురాకు చెందిన సుజాత, అనిఫాలు అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని శిశువును తల్లికి అప్పగించారు. నందిపేట మండలంలో సుజాత అనే మహిళ దగ్గర అనుమానస్పదంగా పాప ఉందని సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. దీనితో పోలీసులను పంపి మహిళను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈనెల ఐదో తేదీన దుబ్బాకకు చెందిన అనిత దంపతులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిపించారు. ఆ తరువాత చిన్నారి అదృశ్యమైంది. చిన్నారిని తమ దగ్గరికి చేరవేయాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. చివరకు శిశువు చేరడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు