15న రాజమహేంద్రిలో జనసేన కవాతు

రాజమహేంద్రవరం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  రాజమహేంద్రవరంలో జనసేన ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న భారీ కవాతుకు ఏర్పాట్లు పూర్తయినట్లు జనసేన నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్‌ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన విూడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన సైన్యంతో కాటన్‌ బ్యారేజీపై కవాతు చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలోకి పవన్‌ చేరుకుంటారని చెప్పారు. రాజకీయ జవాబుదారీ తనాన్ని ప్రశ్నిస్తూ ఈ కవాతును చేపడుతున్నట్లు వివరించారు. సుమారు రెండున్నర కిలోవిూటర్ల పొడవున ఈ కవాతు సాగుతుందన్నారు. అనంతరం ధవళేశ్వరంలోని కాటన్‌ దొర విగ్రహం వద్ద బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఎవరికీ ఏవిధమైన అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. శిక్షణ పొందిన గజ ఈతగాళ్లతో పాటు అంబులెన్సులు, రోప్‌ బృందాలను అందుబాటులో ఉంచామని వివరించారు. కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు పొందామని చెప్పారు.